జోడీ కుదురుతుందా?

20 Jan, 2021 10:11 IST|Sakshi

పూజా హెగ్డే 

అన్నీ కుదిరితే ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ తమిళ తెరపై పూజా హెగ్డే కనిపించే అవకాశం ఉంది. 2012లో చేసిన తమిళ చిత్రం ‘ముగముడి’ ద్వారా కథానాయికగా పరిచయం అయ్యారీ బ్యూటీ. ఆ తర్వాత ‘ఒక లైలా కోసం’తో తెలుగుకి వచ్చారు. ‘అరవింద సమేత వీర రాఘవ, మహర్షి, అల వైకుంఠపురములో’ వంటి సూపర్‌ హిట్‌ చిత్రాలతో ఇక్కడ బిజీ అయ్యారు పూజ. ఇప్పుడు హిందీ చిత్రాలతోనూ బిజీగా ఉన్నారు.

ఈలోపు కోలీవుడ్‌ నుంచి ఆమెకు కాల్‌ వచ్చింది. తమిళ మాస్‌ హీరో విజయ్‌ 65వ సినిమాకి పూజా హెగ్డేని కథానాయికగా అడిగారని సమాచారం. చిత్రదర్శకుడు నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ ఇటీవల పూజా హెగ్డేని కలసి ఈ ప్రాజెక్ట్‌ గురించి చెప్పారట. స్టోరీ లైన్‌ కూడా చెప్పారని తెలిసింది. ఇప్పటికే తెలుగు, హిందీ చిత్రాలకు ఇచ్చిన డేట్స్‌ ఒకసారి చూసుకుని ఈ తమిళ చిత్రానికి పూజ డేట్స్‌  కేటాయించాలనుకుంటున్నారట. ఫిబ్రవరిలో ఈ చిత్రం షూటింగ్‌ని ఆరంభించాలనుకుంటున్నారు.

మరిన్ని వార్తలు