పెద్ద మనసు చాటుకున్న విజయ్‌ సేతుపతి

15 Jun, 2021 13:00 IST|Sakshi

దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ సృష్టించిన బీభత్సం అంత ఇంత కాదు. వేలాది మంచి మృత్యువాత పడ్డారు. లక్షలాది మంది ఉపాదిని కోల్పోయి రోడ్డున​ పడ్డారు. ముఖ్యంగా ఈ సెకండ్‌ వేవ్‌ మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌, ఢిల్లీతో పాటు తెలుగు రాష్ట్రాలపై కూడా తీవ్ర ప్రభావం చూపింది.

ఈ క్రమంలో పేదలకు అండగా ఉండేందుకు సినీ తారలు ముందుకు వస్తున్నారు. కోవిడ్‌పై పోరాటం చేస్త్నున్న ప్రభుత్వాలకు తమ వంతు సాయం చేసి పెద్దమనసును చాటుకుంటున్నారు. ఇప్పటికీ పలువురు సినీ ప్రముఖులు తమకు తోచిన విధంగా సహాయం అందించారు. ఈ నేపథ్యంలో తాజాగా ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి కోవిడ్‌ బాధితులను ఆదుకోవడానికి ముందుకొచ్చారు. కోవిడ్‌పై పోరాటానికి తమిళనాడు ప్రభుత్వానికి రూ. 25 లక్షలు అంజేశాడు. ఈ మేరకు ముఖ్యమంత్రి సహాయ నిధికి పాతిక లక్షల రూపాయల చెక్కును అందజేశారు. సచివాలయంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ని కలుసుకొని ఆ మొత్తానికి సంబంధించిన చెక్కును సమర్పించాడు.

ప్రస్తుతం విజయ్‌ సేతుపతి తమిళంలోనే కాదు తెలుగులోనూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియన్ మూవీలో విజయ సేతుపతి నటించాడనున్నాడట. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం విజయ్ సేతుపతిని తీసుకోవాలని సన్నాహాలు చేస్తున్నారట.
చదవండి:
రజనీ ఆరోగ్యంపై మళ్లీ ఆందోళన.. ప్రత్యేక విమానంలో...

మరిన్ని వార్తలు