నటుడు విజయ్‌ సేతుపతి రూ. కోటి విరాళం

4 Oct, 2021 10:29 IST|Sakshi
పెప్సీ ప్రతినిధులకు చెక్కు అందజేస్తున్న విజయ్‌సేతుపతి

తమిళసినిమా: నటుడు విజయ్‌ సేతుపతి దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య (పెప్సీ) భవన నిర్మాణానికి రూ.కోటి విరాళంగా అందించారు. శనివారం చెన్నైలోని స్థానిక ప్రసాద్‌ ల్యాబ్‌లో పెప్సీ నిర్వాహకులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆ సమాఖ్య అధ్యక్షుడు ఆర్‌కె సెల్వమణి పాల్గొన్నారు.  నిర్మాత కలైపులి ఎస్‌.థాను, కె.భాగ్యరాజ్, ఆర్‌.వి.ఉదయ్‌కుమార్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సమావేశంలో పాల్గొన్న నటుడు విజయ్‌ సేతుపతి పెప్సీ భవన నిర్మాణానికి గాను కోటి రూపాయలను చెక్కు రూపంలో పెప్సీ అధ్యక్షుడు ఆర్‌.కె.సెల్వమణికి అందించారు. అనంతరం మాట్లాడుతూ పెప్సీ భవన నిర్మాణానికి తన సాయం కొనసాగుతుందన్నారు. ఆర్‌.కె.సెల్వమణి మాట్లాడు తూ భవన నిర్మాణం అన్నది పెప్సీకి చెందిన తొమ్మిదివేలమంది సభ్యుల కల అని అన్నారు. ఈ సందర్భంగా నటుడు విజయ్‌సేతుపతికి   కృతజ్ఞతలు తెలిపారు.    

చదవండి: (కమెడియన్‌ వడివేలుకు షాక్‌.. నోటీసులు జారీ చేసిన కోర్టు)

మరిన్ని వార్తలు