కశ్మీర్‌ టు హైదరాబాద్‌

24 May, 2022 05:58 IST|Sakshi
‘వెన్నెల’ కిశోర్, విజయ్‌ దేవరకొండ

కశ్మీర్‌లో ‘ఖుషి’ పూర్తయింది. విజయ్‌ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘ఖుషి’. వై. రవిశంకర్, నవీన్‌ ఎర్నేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గత నెల 23న కశ్మీర్‌లో మొదలైన ‘ఖుషి’ తొలి షెడ్యూల్‌ పూర్తయినట్లుగా చిత్రయూనిట్‌ తెలిపింది.

‘‘కశ్మీర్‌ షెడ్యూల్‌ పూర్తయింది. నెక్ట్స్‌ షెడ్యూల్‌ హైదరాబాద్‌లో ప్లాన్‌ చేస్తున్నాం. ఆ తర్వాత వైజాగ్, అల్లెప్పి లొకేషన్స్‌లో షూటింగ్‌ ప్లాన్‌ చేశాం. డిసెంబరు 23న సినిమాని రిలీజ్‌ చేస్తాం’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: హిషామ్‌ అబ్దుల్‌ వాహబ్‌.  
 

మరిన్ని వార్తలు