Vijayendra Prasad: వారిద్దరూ ఫైట్‌ చేస్తుంటే నాకు కన్నీళ్లొచ్చాయి..!

24 Mar, 2022 02:05 IST|Sakshi

Vijayendra Prasad In RRR Movie Promotions: దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన పాన్‌ ఇండియా మల్టీస్టారర్‌ చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్‌'. ఈ చిత్రం మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలో మునుపెన్నడూ లేని విధంగా జక్కన్న ప్రమోషన్స్‌ చేస్తున్నాడు. దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాలు తిరుగుతూ సినిమాను ప్రమోట్‌ చేస్తున్నాడు. 

అయితే ఈ ప్రమోషన్స్‌లో ఇన్నాళ్లూ అందరూ కనిపిస్తున్నారు కానీ ఈ సినిమాకు కథ అందించిన విజయేంద్ర ప్రసాద్‌ మాత్రం ఎక్కడా కనిపించ లేదు. కనీసం ప్రీ రిలీజ్‌ ఈవెంట్లో కూడా ఆయన కనిపించలేదు. ఇక ఇప్పుడు ఆయన కూడా 'ఆర్‌ఆర్‌ఆర్‌' ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. తాజాగా ఓ ఇంటర్వూలో విజయేంద్ర ప్రసాద్‌ ఈ సినిమా ఇంటర్వెల్‌పై పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

విజయేంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ.. ఈ కథలో చరణ్‌, తారక్‌లు ఇద్దరూ  ప్రాణమిత్రులు. ఒకరి కోసం ఒకరు ప్రాణం ఇచ్చుకునేంత మంచి స్నేహితులు కానీ ఇరువురి ఐడియాలజీ వేరు. సినిమా మొదట్లోనే ఇద్దరూ దక్షిణ ద్రువం, ఉత్తర  ద్రువం అని ఎక్కడొకచోట క్లాష్‌ వస్తుందని తెలుసు కానీ రాకుండా ఉంటే బాగుండు అనుకుంటాం. కానీ వచ్చిన తరువాత కొండల్లో రెండు సింహాలు దెబ్బలాడుకుంటూ ఉంటే చూసి ఎంజాయ్‌ చేయాలి కానీ నాకు ఏడుపొచ్చింది. ఇలా తాను 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమా రష్‌ ఐదు సార్లు చూసానని కానీ చూసిన ప్రతిసారీ తనకు కన్నీళ్లొచ్చాయని విజయేంద్ర ప్రసాద్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు