త్వరలో ముగ్గురం కాబోతున్నాం

28 Aug, 2020 01:39 IST|Sakshi

హీరోయిన్‌ అనుష్కా శర్మ తన అభిమానులకు ఓ శుభవార్త చెప్పారు. భారత క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, అనుష్కా శర్మ 2017 డిసెంబర్‌ 11న ఇటలీలో ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తామిద్దరూ త్వరలో ముగ్గురం కాబోతున్నామని ఈ దంపతులు తెలిపారు. త్వరలోనే తాను తండ్రి కాబోతున్నట్లు ట్వీటర్‌ వేదికగా ప్రకటించి, భార్య అనుష్కా శర్మతో కలిసి ఉన్న ఫొటోను షేర్‌ చేశారు విరాట్‌. ‘‘తొందరలోనే మా ఇంట్లోకి మరొకరు రానున్నారు. జనవరి 2021 తర్వాత మేం ముగ్గురం కాబోతున్నాం’’ అని పేర్కొన్నారు ఈ దంపతులు. దీంతో ఈ దంపతులకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. క్రికెటర్లు, సినీ తారలతో పాటు అభిమానులు సోషల్‌ మీడియా ద్వారా విరుష్కలకు (విరాట్‌ కోహ్లి, అనుష్కా శర్మకు అభిమానులు పెట్టిన పేరు) శుభాకాంక్షలు తెలియజేశారు.

మరిన్ని వార్తలు