Matti Kusthi Official Trailer: 'ఫస్ట్‌ నైట్ వాళ్లకు మాత్రమే.. మనకు కాదు'.. ఆసక్తికరంగా 'మట్టి కుస్తీ' ట్రైలర్

20 Nov, 2022 19:21 IST|Sakshi

విష్ణు విశాల్‌, ఐశ్వర్య లక్ష్మి జంటగా తెరకెక్కిన చిత్రం 'మట్టి కుస్తీ'. ఈ చిత్రానికి చెల్లా అయ్యావు దర్శకత్వం వహించారు. రవితేజ, విష్ణు విశాల్ సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ విడుదల చేసింది చిత్రబృందం. 

ట్రైలర్ చూస్తే.. ' ఇంకోసారి పిల్లను చూడమని నన్ను అడక్కు. మన అల్లుడికి పెళ్లయిందా రత్నం. ఈ జన్మలో అవ్వదు.' అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథతో పాటు కామెడీ ఎంటర్‌టైనర్‌ను తలపించేలా ఉంది. హీరో ఈ సినిమాలో రెజ్లర్‌గా కనిపించనున్నారు. కేరళ అమ్మాయితో ఆంధ్ర అబ్బాయి మధ్య ప్రేమకథ ఆసక్తికరంగా కనిపిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ జరుగుతున్నాయి. ఈ సినిమా డిసెంబర్‌2న థియేటర్లలో ఈ మూవీ సందడి చేయనుంది.  ఈ సినిమాకు జస్టిన్‌ ప్రభాకరణ్‌ సంగీతమందిస్తున్నారు.

మరిన్ని వార్తలు