యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నాడు. విద్యాసాగర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై విడుదలకు ముందే మంచి హైప్ క్రియేట్ అయిన సంగతి తెలిసిందే. మే6న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా ఈ సినిమా అనంతరం విశ్కక్ ఇప్పుడు నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నట్లు తెలుస్తుంది.
'అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమాకు ముందు వరకు రూ. 1.5-2కోట్ల వరకు పారితోషికం తీసుకునే విశ్వక్సేన్ ఇప్పుడు ఆ రెమ్యునరేషన్ను అమాంతం పెంచేశాడట. కొత్త ప్రాజెక్ట్స్ కోసం విశ్వక్ దగ్గరికి వెళ్తే తన రెమ్యునరేషన్ ఇప్పుడు రూ. 3కోట్లు అని చెప్పి నిర్మాతలకు షాక్ ఇస్తున్నాడట. అడిగినంత ఇస్తేనే సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.