సుశాంత్‌ సింగ్‌ స్ఫూర్తితోనే సినిమాల్లోకి వచ్చా: హీరో సన్ని

17 Aug, 2021 08:03 IST|Sakshi

‘నా ప్రయాణం మీడియా నుంచే ప్రారంభమైంది. నేను సినిమాల్లోకి రావడానికి హీరో సుశాంత్‌ సింగ్‌ రాజపుత్‌గారే స్ఫూర్తి. ముందు సీరియల్‌లో లీడ్‌ ఆర్టిస్ట్‌గా చేశాను. ఆ తర్వాత హీరోగా ‘సకల గుణాభి రామ’ చిత్రం చేశాను. ఈ సినిమా అందరికీ నచ్చేలా ఉంటుంది’ అని హీరో వీజే సన్ని అన్నాడు. వెలిగొండ శ్రీనివాస్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘సకల గుణాభి రామ’. వీజే సన్నీ, శ్రీతేజ్, ఆషిమా నర్వాల్, తరుణి హీరో హీరోయిన్లుగా ఈ చిత్రాన్ని వి. సంజీవ రెడ్డి నిర్మించారు.

ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ‘భార్యా భర్తల మధ్య ఎమోషన్స్, రొమాన్స్‌తో పాటు కామెడీ నేపథ్యంలో జరిగే సినిమా ఇది’ అని చెప్పాడు. త్వరలోనే తమ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని నిర్మాత సంజీవ రెడ్డి తెలిపాడు. 

మరిన్ని వార్తలు