భార్య సురేఖతో కలిసి రక్తదానం చేసిన చిరంజీవి

14 Jun, 2021 13:36 IST|Sakshi

అన్ని దానాల కంటే రక్తదానం గొప్పదంటారు. సమయానికి రక్తం అందించడం ద్వారా ఎంతోమంది ప్రాణాలను కాపాడొచ్చు. కానీ ప్రస్తుతం కరోనా కాలంలో చాలా మంది ఇళ్లకే పరిమితమవుతూ రక్తదానానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో సోమవారం World Blood Donor Day సందర్భంగా భార్య సురేఖతో కలిసి మెగాస్టార్‌ చిరంజీవి ర​క్తదానం చేశారు.

ఈ సందర్భంగా 'రక్తం ఇచ్చి ప్రాణాలు కాపాడుతున్న సోదర, సోదరీమణులను అభినందిస్తున్నాను. చిన్న పనితో ఎంతో మంది విలువైన ప్రాణాలను కాపాడుతుండటం, ఏ సంబంధం లేని వారికి రక్తం ఇచ్చి వారితో ఓ రక్త సంబంధాన్ని ఏర్పరుచుకోవడం అనేది గొప్ప అదృష్టం' అని చిరు ట్వీట్‌ చేశారు. గతంలో కరోనా మొదటి వేవ్‌లోనూ చిరంజీవి స్వయంగా ముందుకు వచ్చి రక్తదానం చేసిన సంగతి తెలిసిందే. 

చదవండి : ఆట సందీప్‌కు వాయిస్‌ మెసేజ్‌ పంపిన మెగాస్టార్‌ చిరంజీవి
గుర్తుపట్టరాని విధంగా మారిపోయిన హీరోయిన్ మీనాక్షి

మరిన్ని వార్తలు