'హే సగో' అనే వీడియో ఆల్బమ్ కోసం ఆడి పాడిన బాలనటుడు యోగేశ్వరన్ను పలువురు సినీ ప్రముఖులు అభినందనలతో ముంచెత్తారు. రఘురామన్, సంగీత దంపతులు రూపొందించిన వీడియో ఆల్బమ్ హే సగో, జై క్రిష్ కదీర్ పాటను రాసి సంగీతాన్ని సమకూర్చి దర్శకత్వం వహించిన ఈ వీడియో ఆల్బమ్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని శుక్రవారం సాయంత్రం చెన్నైలోని ప్రసాద్ల్యాబ్లో నిర్వహించారు.
ఈ వేడుకలో దర్శకుడు పేరరసు, రాజు మురుగన్, నటుడు, నిర్మాత కె.రాజన్, గాయకుడు ఉన్నికృష్ణన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ ఆల్భమ్ ద్వారా మంచి సంగీత ప్రయత్నం చేశారని గాయకుడు ఉన్నికృష్ణన్ పేర్కొన్నారు. ఇందులో ఆడి పాడిన చిన్నారి యోగేశ్వరన్కు ఇంత మంచి అవకాశం కల్పించి ప్రోత్సహించిన అతని తల్లిదండ్రులను అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కుర్రాడు మరింతగా ఎదిగి తమిళ కళలను ప్రపంచస్థాయిలో వ్యాప్తి చేయాలని కె. రాజన్ ఆకాక్షించారు.
చదవండి: బాడీ షేమింగ్ చేశారు, మట్కా అని పిలిచేవారు: జెర్సీ హీరోయిన్