సాక్షి, చెన్నై: వినోదాన్ని పంచే రీతిలో ఓటీటీ వేదికగా 'దేఖే రెహ్ జాగోజీ' పేరిట సరికొత్త ప్రచారానికి శ్రీకారం చుట్టామని జీ–5 ఇండియా ప్రధాన అధికారి మనీష్ కల్రా తెలిపారు. శనివారం ఆన్లైన్ వేదికగా ఈ ప్రచారం గురించి వివరించారు. 18–34 ఏళ్లలోపు యువ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. అపరిమిత వినోదం, వెబ్ సిరీస్, సినిమా, టీవీఎఫ్ షోలు, లైవ్తో 12కు పైగా భాషల్లో ఈ ప్రచారం సాగుతుందన్నారు.
చదవండి: సినీ ప్రియులకు గుడ్ న్యూస్.. థియేటర్స్ ఓపెన్.. ఇక జాతరే!