కాళేశ్వరం: .....

6 Mar, 2023 01:02 IST|Sakshi

కాళేశ్వరం: మహదేవపూర్‌ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వరముక్తీశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ముగిసి ఆదివారం నాటికి 16 రోజులు గడుస్తున్న సందర్భంగా ఆనవాయితీ ప్రకారం ఉత్సవ మూర్తులకు అర్చకులు శాస్త్రాక్తంగా కల్యాణం నిర్వహించారు. శుభానంద– ముక్తీశ్వరస్వామివార్ల కల్యాణం 16వ పండుగ రోజు తంతును వేదమంత్రోచ్చరణల మధ్యన వైభవంగా పూర్తిచేశారు. ఈ కార్యక్రమం అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. కార్యక్రమంలో ఎంపీటీసీ మమత, సర్పంచ్‌ వసంత, సీనియర్‌ అసిస్టెంట్‌ ఉమామహేశ్వర్‌, మాజీ సర్పంచ్‌ కామిడి రాంరెడ్డి పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు