రైతులకు సన్మానం

23 Mar, 2023 02:12 IST|Sakshi

టేకుమట్ల(రేగొండ): రేగొండ మండలంలోని కోటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈ నెల 2 నుంచి 9వ తేదీ వరకు కొనసాగిన బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల వాహనాల పార్కింగ్‌ కోసం వ్యవసాయ భూములను కల్పించిన రైతులను బుధవారం ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి ఆలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారికి శాలువాలతో సన్మానించి, జ్ఞాపికలను అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నాలుగు చోట్ల పార్కింగ్‌ స్థలాలను ఏర్పాటు చేశామన్నారు. అది పూర్తిగా రైతుల సహకారంతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతుల సహకారంతో పార్కింగ్‌ స్థలాలను ఏర్పాటు చేసినట ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. జాతర విజయవంతానికి కృషి చేసిన రైతులు సాంబయ్య, పోగు సమ్మయ్య, సింగరి వనమ్మ, కరుణాకర్‌ తదితరులకు ధన్యవాదాలు తెలిపారు.

మరిన్ని వార్తలు