భూ సమస్యల పరిష్కారానికి కృషి

24 Mar, 2023 05:56 IST|Sakshi
రికార్డులు పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్‌

ఏటూరునాగారం: భూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు అదనపు కలెక్టర్‌ గణేష్‌ అన్నారు. గురువారం మండలకేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీచేసి రికార్డులను పరిశీలించారు. మండలాల్లో నెలకొన్న సమస్యలకు సత్వరమే పరిష్కారం చూపాలన్నారు. అనంతరం గిరిజన బాలికల గురుకుల కళాశాలలో జరుగుతున్న ఇంటర్మీడియేట్‌ పరీక్షల సరళిని ఆయన పరిశీలించారు. కార్యాలయంలో ప్రిన్సిపల్‌ వసుంధర, లెక్చరర్లతో పరీక్షలపై మాట్లాడారు.

మండల కేంద్రంలో పక్కా భవనంతో తహసీల్దార్‌ కార్యాలయం నిర్మించాలని స్థానిక రైతులు, ప్రజలు అదనపు కలెక్టర్‌ను కోరారు. ముల్లకట్ట బ్రిడ్జి వద్ద అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అలాంటి వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌ సంజీవను అదనపు కలెక్టర్‌ ఆదేశించారు. ఆయన వెంట ఆర్‌ఐ శ్రీనివాస్‌ ఉన్నారు.

మరిన్ని వార్తలు