బ్రిడ్జి వచ్చింది.. వ్యథ తీరింది

24 Mar, 2023 05:56 IST|Sakshi

ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు నర్సింహసాగర్‌ గ్రామాల మధ్య మల్లూరువాగుపై బ్రిడ్జి లేక అవతలి గ్రామాలైన నర్సింహసాగర్‌, శనిగకుంట, పూరేడుపల్లి, బాలన్నగూడెం పంచాయతీ పరిధిలోని నీలాద్రిపేట గ్రామాలకు పూర్తిగా రవాణా సౌకర్యం నిలిచిపోయేది. 2008 నుంచి వర్షాకాలంలో ఆయా గ్రామాల ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ప్రత్యేక కథనాలు ప్రచురించింది. స్పందించిన అప్పటి కలెక్టర్‌ నారాయణరెడ్డి 2018–2019 ఆర్థిక సంవత్సరంలో వాగుపై 45 మీటర్ల బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేసి నిర్మాణం పూర్తి చేశారు.

మరిన్ని వార్తలు