ఎస్ఎస్తాడ్వాయి: పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని జెడ్పీ వైస్ చైర్పర్సన్ బడే నాగజ్యోతి అన్నారు. శుక్రవారం మండలం కేంద్రంలోని ఐసీడీఎస్ కార్యాలయంలో సీడీపీఓ మల్లేశ్వరీ అధ్యక్షతన మండలంలోని నార్లాపూర్, తాడ్వాయి, పంబపూర్ సెక్టార్ల పరిధిలోని అంగన్వాడీ టీచర్లకు పోషన పక్షంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా జెడ్పీ వైస్ చైర్పర్సన్ నాగజ్యోతి, ఎంపీపీ గొంది వాణిశ్రీ హాజరై మాట్లాడుతూ పిల్లల ఇష్టాలకు అనుకూలంగా పోషకాహారం అందించడంతో ఇష్టంగా తింటారన్నారు. అనంతరం జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత మాట్లాడుతూ ప్రభుత్వం వారంలో ఒకరోజు చిరుధాన్యాలు అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తుందని, ప్రజల్లో అలవాటు చేసేలా టీచర్లు అవగాహన కల్పించాలన్నారు. పంబపూర్, నార్లాపూర్, తా డ్వాయి సెక్టర్ల నుంచి అంగన్వాడీ టీచర్లు చిరుధాన్యాలతో తయారు చేసిన ఆహార వంటల స్టాల్స్ ఏ ర్పాటు చేశారు. ఏ రకమైన ఆహార పదార్థాలతో పో షక విలువలు ఉంటాయని వారికి వివరించారు.