ఉత్సవాల్లో పటిష్టమైన బందోబస్తు

21 Mar, 2023 01:18 IST|Sakshi
సీఐతో మాట్లాడుతున్న ఎస్పీ రఘువీర్‌రెడ్డి

శ్రీశైలం: శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది ఉత్సవాల సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్‌రెడ్డి తెలిపారు. సోమవారం సాయంత్రం శ్రీశైలం చేరుకున్న ఆయన క్షేత్ర పరిధిలో పర్యటించి బందోబస్తులో ఉన్న పోలీసులకు సూచనలు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ లక్షలాదిగా తరలివస్తున్న భక్తులకు భద్రతా కల్పిచేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగకుండా బ్లూకోట్స్‌ సిబ్బందిని నియమించామన్నారు. దాదాపు 1000 మంది సిబ్బంది విధుల్లో ఉన్నారన్నారు. ఎస్పీ వెంట శ్రీశైలం సీఐ దివాకర్‌రెడ్డి, ఎస్‌ఐ లక్ష్మణరావు తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు