బేతంచెర్ల: సోమవారం ఉదయం బేతంచెర్ల నుంచి బనగానపల్లెకు వెళ్తున్న ఆర్టీసీ విద్యార్థి బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఉదయం 7.45 గంటలకు 40 మంది విద్యార్థులతో బయలుదేరిన బస్సు పట్టణ శివారులో డౌన్కు వెళ్లే సమయంలో డ్రైవర్ మునిస్వామి గేర్ మార్చకుండా నిర్లక్ష్యంగా నడుపుతున్నాడు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ను తప్పించే క్రమంలో బస్సు అదుపు తప్పింది. పక్కనే పైప్లైన్ కోసం తవ్విన గుంతలోకి దూసుకెళ్లి నిలిచిపోయింది. లేదంటే పెను ప్రమాదం జరిగేది. కొద్ది దూరంలోనే ప్రమాదకర గోర్లగుట్ట మలుపులు ఉన్నాయి. అక్కడ అదుపు తప్పి వుంటే పెను ప్రమాదం జరిగే అవకాశం ఉండేది. సమాచారం అందుకున్న ఆర్టీసీ అధికారులు అక్కడికి చేరుకుని క్రేన్ సహాయంతో బస్సును బయటకు తీశారు. డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఈ సంఘటన చోటు చేసుకుందని బనగానపల్లె డిపో మేనేజర్ తెలిపారు.
అదుపు తప్పి గుంతలోకి
దూసుకెళ్లిన బస్సు
సమీపంలోనే ప్రమాదకర
గోర్లగుట్ట మలుపులు