నంద్యాల(వ్యవసాయం): దేవదాయ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లా దేవాలయాల్లో పని చేస్తున్న ముగ్గురు అర్చకులు ఉగాది పురస్కారాలకు ఎంపికై నట్లు నంద్యాల జిల్లా ఎండో మెంట్ అసిస్టెంట్ కమిషనర్ సుధాకర్రెడ్డి మంగళవారం తెలిపారు. నంద్యాల కోటావీధిలోని బ్రహ్మనందీశ్వరస్వామి ఆలయ ప్రధాన అర్చకుడు రాచకొండ మురళీధర్శర్మ, నొస్సం రామలింగేశ్వరస్వామి ప్రధాన అర్చకుడు పెట్నికోట శ్రీకాంత్శర్మ, శిరివెళ్ల మండలం కోటపాడు శ్రీ చెన్నకేశవస్వామి ప్రధాన అర్చకుడు శ్రీనివాసులు పురస్కారాలకు ఎంపికై నట్లు చెప్పారు. బుధవారం ఉదయం నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో పురస్కారాలతో పాటు రూ.10,116, ప్రశంసా పత్రాలు అందజేస్తారన్నారు.