గ్రూప్‌–1 పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ

26 Mar, 2023 01:38 IST|Sakshi

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: గ్రూప్‌–1 (ప్రిలిమ్స్‌) పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే ఉమ్మడి జిల్లాకు చెందిన నిరుద్యోగ యువతీ, యువకులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు బీసీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ స్వప్న శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, నారాయణపేట జిల్లా లకు చెందిన అభ్యర్థులు ఈ నెల 28లోగా నేరుగా మెట్టుగడ్డలోని తమ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలన్నారు. గతంలో గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ లో అర్హత సాధించిన వారికి 50 శాతం వెయిటేజీ ఇస్తామన్నారు. రెండు నెలలపాటు కొనసాగే శిక్ష ణ కు పదో తరగతి, ఇంటర్మీడియట్‌, డిగ్రీలో 60 శా తం మార్కులతో పాసైన వారు మాత్రమే అర్హుల న్నారు. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.5 లక్షలలోపు ఉండాలని, పూర్తి వివరాలకు ఫోన్‌ నం.085 42– 293790లో సంప్రదించాలని సూచించారు.

మరిన్ని వార్తలు