సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక వీసీగా ప్రొఫెసర్ బట్టు సత్యనారాయణ
సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వీసీగా బసుత్కర్ జె. రావ్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని 12 సెంట్రల్ యూనివర్సిటీల్లో వైస్ ఛాన్సలర్ల నియామకానికి రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ గురువారం ఆమోదం తెలిపారని విద్యా శాఖ తెలిపింది. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, హర్యానా, హిమాచల్ప్రదేశ్, జమ్మూ, జార్ఖండ్, కర్ణాటక, తమిళనాడు, గయాలోని దక్షిణ బిహార్, మణిపూర్ విశ్వవిద్యాలయం, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ విశ్వవిద్యాలయం, నార్త్–ఈస్టర్న్ హిల్ విశ్వవిద్యాలయం, బిలాస్పూర్ గురు ఘాసిదాస్ విశ్వవిద్యాల యాలకు వీసీల నియామకం జరిగింది.
కర్ణాటక సెంట్రల్ యూనివర్సిటీ నూతన వైస్ ఛాన్స్లర్గా ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ యూనియన్ అధ్యక్షుడు ప్రొఫెసర్ సత్యనారాయణను నియమించారు. దేశంలోని సెంట్రల్ యూనివర్సిటీల్లో మొత్తం 22 వైస్ ఛాన్సలర్ల పోస్టులు ఖాళీగా ఉన్నా యని, అందులో 12 పోస్టులకు నియామకాలను రాష్ట్రపతి ఆమోదం తెలిపారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గురువారం రాజ్యసభకు తెలిపారు. అయితే ప్రస్తుతం పూర్తిస్థాయి వీసీలు లేని సెంట్రల్ యూనివర్సిటీలలో బనారస్ హిందూ యూనివర్సిటీ , ఢిల్లీ యూనివర్సిటీ, జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ వంటి ప్రముఖ విద్యాసంస్థలు ఉన్నాయి.
కొత్త వైస్ ఛాన్స్లర్లు వీరే..