12 అడుగుల కొండచిలువ పట్టివేత.. 

6 Apr, 2021 10:08 IST|Sakshi

సాక్షి, మల్కన్‌గిరి(ఒడిశా): జిల్లాలోని కలిమెల సమితి, ఎంవీ–75 గ్రామంలో 12 అడుగుల కొండచిలువ సంచరిస్తూ కలకలం సృష్టించింది. సోమవారం ఉదయం ఆ గ్రామ శివారులోని కాలువలో ఆహార అన్వేషణలో భాగంగా అక్కడ తిరుగుతున్న కొండచిలువని గ్రామస్తులు కొంతమంది చూసి, అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న అధికారులు చాకచక్యంతో దానిని పట్టుకుని దగ్గరలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.   

మరిన్ని వార్తలు