2013 పట్నా పేలుళ్ల కేసు: నలుగురికి ఉరిశిక్ష

1 Nov, 2021 17:14 IST|Sakshi
ఫైల్‌ఫోటో

2013 పట్నా పేలుళ్ల కేసులో నలుగురికి ఉరిశిక్ష విధించిన ఎన్‌ఐఏ కోర్టు

మొత్తం 9మందిని దోషులుగా ప్రకటించిన కోర్టు

న్యూఢిల్లీ: 2013 పట్నా పేలుళ్ల కేసులో ఎన్‌ఐఏ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఈ కేసుకు సంబంధించి నలుగురు దోషులకు మరణశిక్ష విధించింది. ఇద్దరికి జీవిత ఖైదు, మరో ఇద్దరికి పదేళ్ల జైలు శిక్ష విధించింది. మరో దోషికి ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. పేలుళ్ల కేసులో మొత్తం 9 మందిని ఎన్‌ఐఏ కోర్టు దోషులుగా తేల్చింది. 2013 అక్టోబర్‌ 13న మోదీ ర్యాలీ లక్ష్యంగా వరుస పేలుళ్లు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు