ఒకే కుటుంబంలో 32 మందికి పాజిటివ్‌

26 Apr, 2021 12:37 IST|Sakshi

సాక్షి, యశవంతపుర: సెకండ్‌వేవ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. తాజాగా కొడగు జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన 32 మందికి పాజిటివ్‌ రావటం కలకలం రేపుతోంది. విరాజపేట తాలూకా కెదముళ్లూరు గ్రామంలో చురియాల్‌ కుటుంబానికి చెందిన 32 మందికి కరోనా సోకింది. వీరిని ఆరోగ్య సిబ్బంది విరాజ్‌పేట ఆస్పత్రికి తరలించారు.

కేజీఎఫ్‌లో కరోనా పంజా
కేజీఎఫ్‌: కేజీఎఫ్‌లో ఆదివారం 144 మంది కరోనా బారిన పడ్డారు. ప్రభుత్వ ఆసుపత్రిలోని కోవిడ్‌ సెంటర్‌లోఘున్న 60 బెడ్లు భర్తీ అయ్యాయి. రోజూ రోగులు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో ఏ ఆస్పత్రికి పంపాలో వైద్యశాఖ వర్గాలకు దిక్కుతోచడం లేదు. ఇలాగే కొనసాగితే రోగులను ఇళ్లో ఉంచి చికిత్స చేయక తప్పదని ఆరోగ్యాధికారులు తెలిపారు. వీకెండ్‌ కర్ఫ్యూ రెండో రోజైన ఆదివారం నగరంలో దుకాణాలను మూయించారు.

చదవండి: ‘ఓ’ గ్రూప్‌ రక్తం ఉన్న వారికి కరోనా రిస్క్‌ తక్కువ, వారికి మాత్రం!

>
మరిన్ని వార్తలు