Coronavirus: దేశంలో తగ్గిన కొత్త కేసులు.. పెరిగిన రికవరీలు

22 Jun, 2021 10:40 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 42,640 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 1,167 మంది కోవిడ్‌ బాధితులు మృతి చెందారు. దీంతో కరోనా వైరస్‌ బారినపడి మొత్తం  3,89,302 మంది ప్రాణాలు కోల్పోయారు.

అంతేకాకుండా గత 24 గంటల్లో 81,839 మంది కోవిడ్‌ బాధితులు వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో దేశంలో ఇప్పటివరకు మొత్తం 2,89,26,038 మంది కరోనా బాధితులు కోలుకున్నారు.  దేశంలో ప్రస్తుతం 6,62,521 కరోనా పాజిటివ్‌ కేసులు ఉన్నాయి. ఇక దేశంలో ఇప్పటివరకు 28.87 మందికిపైగా కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

చదవండి: విషాదం: ప్రపంచ రికార్డ్‌ కోసం ఫీట్‌.. ప్రాణాలు గాల్లో.. 

మరిన్ని వార్తలు