న్యూఢిల్లీ: భారత్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 46,791 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 75,97,064కు చేరుకుంది. వైరస్ బాధితుల్లో తాజాగా 587 మంది మృతి చెందడంతో ఆ మొత్తం సంఖ్య 1,15,197 కు చేరింది. దేశ వ్యాప్తంగా నిన్నటి రోజున 69,721 మంది డిశ్చార్జి కాగా.. ఇప్పటివరకు కోలుకున్న వారి మొత్తం సంఖ్య 67,33,329గా ఉంది. ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న కేసుల సంఖ్య 7,48,538. ఈమేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం హెల్త్ బులెటిన్లో పేర్కొంది. (కరోనాతో కొత్తముప్పు !)