సాక్షి, న్యూఢిల్లీ : భారత్లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. నిత్యం 40 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 48,268 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 81,37,119కు చేరింది. నిన్న ఒక్క రోజే 551 మంది మరణించగా ఇప్పటివరకు మొత్తం 1,21,641 మంది కరోనాతో మృత్యువాతపడ్డారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ( పెళ్లిళ్ల సందడి మళ్లీ మొదలైంది! )
నిన్న 59,454 మంది కోలుకుని ఆసుపత్రులనుంచి డిశ్చార్జ్ అవ్వగా ఇప్పటి వరకు మొత్తం 74,32,829 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 5,82,649గా ఉంది. దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 91.34 శాతంగానూ.. నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 7.16 శాతంగా ఉంది. మరణాల రేటు 1.49 శాతానికి తగ్గింది.