ఢిల్లీలో ఒవైసీ ఇంటిపై దాడి

22 Sep, 2021 03:47 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ అధికారిక నివాసంపై దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు హిందూ సేన సభ్యులను మంగళవారం అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీసులు చెప్పారు. ఢిల్లీలోని అశోక రోడ్డులో ఒవైసీ నివాసం ఉంది. ఈ దాడి గురించి సాయంత్రం 5 గంటలకు తమకు సమాచారం అందిందని, వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నామని పోలీసులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేశామన్నారు. ఈ దాడిలో ఎవరికీ గాయాలు కాలేదని, ఆస్తి నష్టం వాటిల్లలేదని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు