కర్ణాటకలో విషవాయువు లీకేజీ... ఐదుగురి దుర్మరణం

19 Apr, 2022 06:18 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: కర్ణాటకలోని మంగళూరులో చేపల ప్రాసెసింగ్‌ పరిశ్రమలో విషవాయువు లీకై ఐదుగురు కార్మికులు మరణించారు. శ్రీ ఉల్కా మత్స్య సంస్కరణ కర్మాగారంలో ఈ ప్రమాదం జరిగింది. 20 అడుగుల లోతున్న ట్యాంకు నుంచి చేపలను బయటకు తీసేందుకు ఆదివారం రాత్రి 8 మంది కార్మికులు దిగారు. చేపల వ్యర్థాలను తొలగించేందుకు వాడే విష వాయువు లీకవడంతో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు సోమవారం తెల్లవారుజామున ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర అస్వస్థతకు గురైన ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

మరిన్ని వార్తలు