-

భారత్‌లో కొత్తగా 55,838 కరోనా కేసులు

22 Oct, 2020 09:45 IST|Sakshi

న్యూఢిల్లీ : భారత్‌లో గడిచిన 24 గంటల్లో 55,838 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 77,06,946కి చేరింది. నిన్న ఒక్క రోజే  702 మంది మరణించగా ఇప్పటివరకు మొత్తం 1,16,616 మంది కరోనాతో మృత్యువాతపడ్డారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. నిన్న 79,415 మంది కోలుకుని ఆసుపత్రులనుంచి డిశ్చార్జ్‌ అవ్వగా ఇప్పటి వరకు మొత్తం 68,74,518 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్‌ కేసుల సంఖ్య 7,15,812గా ఉంది. ( అభద్రతా భావంలో మెజారిటీ ఉద్యోగులు...)

కాగా, గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 14,69,984 శాంపిళ్లను పరీక్షించామని, ఇప్పటివరకు 9,86,70,363 శాంపిళ్లను పరీక్షించామని ఐసీఎమ్‌ఆర్‌(ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌) తెలిపింది.

మరిన్ని వార్తలు