న్యూఢిల్లీ : దేశంలో గడిచిన 24 గంటల్లో 63,371 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 73,70,469కి చేరింది. నిన్న ఒక్క రోజే 895 మంది మరణించగా ఇప్పటివరకు మొత్తం 1,12,161 మంది కరోనాతో మృత్యువాతపడ్డారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. నిన్న 64,53,780 మంది కోలుకుని ఆసుపత్రులనుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 8,04,528గా ఉంది. ( పార్కుల్లో సీసీటీవీలు..)
కాగా, గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 10,28,622 శాంపిళ్లను పరీక్షించామని, ఇప్పటివరకు 9,22,54,927 శాంపిళ్లను పరీక్షించామని ఐసీఎమ్ఆర్(ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) తెలిపింది.