న్యూఢిల్లీ : దేశంలో గడిచిన 24 గంటల్లో 67,708 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 73,07,098కి చేరింది. నిన్న ఒక్క రోజే 680 మంది మరణించగా ఇప్పటివరకు మొత్తం 1,11,266 మంది కరోనాతో మృత్యువాతపడ్డారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. నిన్న 63,83,442 మంది కోలుకుని ఆసుపత్రులనుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 8,12,390గా ఉంది.
కాగా, గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 11,36,183 శాంపిళ్లను పరీక్షించామని, ఇప్పటివరకు 9,12,26,305 శాంపిళ్లను పరీక్షించామని ఐసీఎమ్ఆర్(ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) తెలిపింది.
చదవండి : డొనాల్డ్ ట్రంప్ కుమారుడికి కరోనా..