దేశంలో కొత్తగా 96,424 పాజిటివ్‌ కేసులు

18 Sep, 2020 09:48 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో మొత్తం 96,424 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. వైరస్‌ బారినపడి 1174 మంది మృతి చెందారు. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 52,14,678 చేరగా.. మృతుల సంఖ్య 84372కి పెరిగింది. ఇప్పటివరకు కోలుకుని 41,12,552 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. దేశంలో ప్రస్తుతం 10,17,754 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌ బులిటెన్‌ జారీచేసింది. (రష్యా వ్యాక్సిన్‌తో సైడ్‌ ఎఫెక్ట్స్‌)

మరిన్ని వార్తలు