Karnataka HM: హోంమంత్రి ఇంటిపై ఏబీవీపీ కార్యకర్తల దాడి!

31 Jul, 2022 07:18 IST|Sakshi

శివాజీనగర: దక్షిణ కన్నడ జిల్లాలో బీజేపీ నేత ప్రవీణ్‌ నెట్టారు హత్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏబీవీపీ కార్యకర్తలు శనివారం కర్ణాటక హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర ఇంటిని ముట్టడించారు. శనివారం బెంగళూరులో జ్ఞానేంద్ర ఇంటి ప్రాంగణంలోకి చొరబడి బైఠాయించి నిరసన తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు నాశనమయ్యాయని, హోం శాఖను నిర్వహించటంలో విఫలమైన మంత్రి.. పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌చేశారు. తర్వాత ఆందోళనకు దిగిన వారిపై పోలీసులు లాఠీచార్జీ చేసి చెదరగొట్టారు. కొందరిని అరెస్ట్‌ చేసి 30 మందిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదుచేశారు.

ఇదీ చదవండి: కళాశాల విద్యార్థికి ఉగ్రవాదులతో లింక్‌!

మరిన్ని వార్తలు