హైవేపై లారీ బీభత్సం.. 48 వాహనాలు ధ్వంసం.. 30 మందికి గాయాలు

20 Nov, 2022 23:02 IST|Sakshi

పుణె: మహారాష్ట్రలోని పుణెలో ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో ఘోర ప్రమాదం సంభవించింది. పుణె-బెంగళూరు హైవేపై ఉన్న ఓ వంతెన వద్ద ఓ ట్యాంకర్‌ లారీ బీభత్సం సృష్టించింది. ముందు ఉన్న వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మొత్తం 48 వాహనాలు ధ్వంసమయ్యాయి. సుమారు 30 మంది వరకు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. పుణెలోని నావెల్‌ వంతెనపై ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక విభాగం, పుణె మెట్రోపాలిటన్‌ ప్రాంత అభివృద్ధి సంస్థ అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

స్థానిక మీడియా ప్రకారం.. ఓ ట్యాంకర్‌ లారీ వేగంగా వెళ్తుండాగ బ్రేకులు పని చేయకపోవటంతో ముందు వెళ్తున్న వాహనాలను ఢీకొట్టింది. అందులోని చమురు రోడ్డుపై పడటం వల్ల పలు వాహనాలు పట్టుకోల్పోయి ముందున్న వాహనాలను ఢీకొట్టాయి. మొత్తంగా 48 వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. 

ఇదీ చదవండి: శ్రద్ధ వాకర్ హత్య కేసు.. అడవిలో పుర్రె, దవడ స్వాధీనం చేసుకున్న పోలీసులు

మరిన్ని వార్తలు