పంద్రాగస్ట్‌ ముందు ఢిల్లీలో భారీ కుట్ర భగ్నం

13 Aug, 2021 17:40 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, న్యూఢిల్లీ: పంద్రాగస్ట్‌ వేడుకలకు ముందు ఢిల్లీలో భారీ కుట్రను భగ్నం చేశారు పోలీసులు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో అలజడి సృష్టించాలని భావించిన దుండగుల ప్రయత్నాన్ని భద్రతా దళాలు చేధించాయి. ఈ క్రమంలో స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు దుండగుల వద్ద నుంచి 55 పిస్టల్స్‌, 50 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అరెస్ట్‌ చేశారు పోలీసులు. 

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా దేశ రాజధానిలో పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఎర్రకోట వైపు వెళ్లే దారులను పూర్తిగా మూసివేశారు. ఆ మార్గంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 

మరిన్ని వార్తలు