లక్నో: హాథ్రస్ ఘటన కేసుపై అలహాబాద్ లక్నో బెంచ్ సోమవారం విచారణ చేపట్టింది. బాధిత మృతురాలికి గుట్టుచప్పుడుగా అర్థరాత్రి అంత్యక్రియలు జరిపించిన ఉత్తర ప్రదేశ్ పోలీసుల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్త చేసింది. తమ బంధించి బలవంతంగా పోలీసులు అంత్యక్రియలు జరిపించారని బాధితురాలి కుటుంబ సభ్యుల స్టేట్మెంట్ను రికార్డు చేసిన హైకోర్టు యూపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నవంబర్ 2వ తేదికి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది.