Amarnath Yatra: ప్రతికూల వాతావరణంతో అమర్‌నాథ్ యాత్రకు బ్రేక్‌

5 Jul, 2022 13:26 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: అమర్‌నాథ్‌ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. పహల్గామ్‌ బేస్ క్యాంప్‌ నుంచి భక్తులెవరినీ మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు అనుమతించట్లేదని పేర్కొన్నారు. పరిస్థితులు మెరుగుపడిన తర్వాత యాత్ర తిరిగి ప్రారంభమవుతుందన్నారు.

కరోనా కారణంగా రెండేళ్ల విరామం తర్వాత జూన్‌ 30న అమర్‌నాథ్‍ యాత్ర ప్రారంభమైంది. జమ్ముకశ్మీర్‌లోని ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునేందుకు దేశ నలుమూల నుంచి భక్తులు వెళ్తుంటారు. అనంత్ నాగ్‌ జిల్లా పహల్గామ్‌లోని నున్వాన్ క్యాంప్‌,  గందర్‌బల్ జిల్లా బాల్‌టాల్‌ క్యాంప్ నుంచి ఈ ఏడాది అమర్‍నాథ్ యాత్రను ప్రారంభించారు. యాత్రను తాత్కాలికంగా నిలిపివేసేవరకు 72,000 మందికిపైగా భక్తులు పవిత్ర పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. ఆగస్టు 11న రాఖీ పౌర్ణమి రోజున అమర్‌నాథ్‌ యాత్ర ముగుస్తుంది.

మరిన్ని వార్తలు