AP Government: సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్‌

14 Dec, 2022 17:44 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలోని షెడ్యూల్ తొమ్మిది, పది సంస్థల విభజనలో ఆలస్యంపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ సంస్థల విభజన ఆలస్యంతో ఏపీ నష్టపోతుందని పిటిషన్‌లో పేర్కొంది.

షెడ్యూల్‌ తొమ్మిది, పదిలో ఉన్న సంస్థల విలువ దాదాపు రూ.1,42,601 కోట్లు. ఈ సంస్థలు దాదాపు 91శాతం తెలంగాణలోనే ఉన్నాయి. విభజన అంశంపై తెలంగాణ స్పందించకపోవడం ఏపీ ప్రజల ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే అని ఏపీ ప్రభుత్వం పిటిషన్‌లో పేర్కొంది. తక్షణమే సంస్థల విభజనకు ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరింది. 

చదవండి: (నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్‌)

మరిన్ని వార్తలు