ప్రధాని మోదీకి సీఎం జగన్‌ ప్రగాఢ సానుభూతి

30 Dec, 2022 07:53 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: ప్రధాని నరేంద్రమోదీ తల్లి హీరాబెన్‌ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. హీరాబెన్‌ మృతి పట్ల అమిత్‌ షా, వెంకయ్యనాయుడు, యోగి ఆదిత్యనాథ్‌, దిగ్విజయ్‌సింగ్‌ సంతాపం తెలిపారు. 

కాగా, ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్‌ మోదీ (100) కన్నుమూశారు. అనారోగ్యంతో రెండు రోజుల క్రితం ఆమె ఆస్పత్రిలో చేరారు. అహ్మదాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. గురువారం అర్ధరాత్రి సమయంలో మృతి చెందారు.

చదవండి: (ప్రధాని మోదీకి మాతృ వియోగం)

మరిన్ని వార్తలు