రావణ పాత్రధారి అరవింద్‌ త్రివేది కన్నుమూత

7 Oct, 2021 06:27 IST|Sakshi

ముంబై: 1986లో వచ్చిన రామాయణం సీరియల్‌లో రావణుడి పాత్ర పోషించిన ప్రముఖ నటుడు అరవింద్‌ త్రివేది కన్నుమూశారు. మంగళవారం రాత్రి  ఆయనకు గుండెపోటు రావడంతో మరణించారని ఆయన బంధువు కౌస్తుభ్‌  తెలిపారు. వయో సంబంధిత సమస్యలతో ఆయన చాలా కాలం నుంచి బాధపడుతు న్నారని పేర్కొన్నారు.  బుధవారం ఉదయం దహనుకార్‌ వాడి ప్రాంతంలో ఆయన అంత్యక్రియలు పూర్తి చేసినట్లు వెల్లడించారు. అరవింద్‌ మృతిపై ప్రధాని∙మోదీ స్పందించారు. రామాయణం సీరియల్‌లో ఆయన పాత్రను ప్రజలు చిరకాలం గుర్తుంచు కుంటారని అన్నారు. 1991లో అరవింద్‌ బీజేపీ తరఫున సబర్కాతా నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. 1996 వరకు ఆయన ఎంపీగా సేవలందించారు.

మరిన్ని వార్తలు