రైలు ఢీకొని ఏనుగు, దాని బిడ్డ మృతి

10 Oct, 2022 21:35 IST|Sakshi

అస్సాం జోర్హాట్‌ జిల్లాలో రైలు ఢీకొని ఏనుగు దాని 10నెలల బిడ్డ చనిపోయాయి. ఆదివారం రాత్రి 10:50 గంటలకు ఈ ఘటన జరిగినట్లు అధికారులు సోమవారం తెలిపారు. రైలు పట్టాలపై ఉన్న ఓ ఏనుగల మందను నాగినిమోరా రాజధాని ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టినట్లు పేర్కొన్నారు.

ఈ ఘటనలో ఏనుగు దాని పిల్లను రైలు 50 మీటర్ల పాటు ఈడ్చుకెళ్లినట్లు తెలుస్తోంది. తీవ్రగాయాలపాలై అవి చనిపోయినట్లు సమాచారం. ఏనుగు వయసు 21 ఏళ్లు, దాని బిడ్డ వయసు 10నెలలు అని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు చెప్పారు.
చదవండి: నన్ను గెలిపిస్తే రూ.20కే పెట్రోల్‌, ఇంటికో బైక్‌..

మరిన్ని వార్తలు