స్వతంత్ర భారతి: నూరవ ‘సైన్స్‌ కాంగ్రెస్‌’

6 Aug, 2022 19:26 IST|Sakshi

నూరవ ‘సైన్స్‌ కాంగ్రెస్‌’ సమావేశాలు కలకత్తాలో జనవరి 3 నుంచి 7 వ తేదీ వరకు జరిగాయి. ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ అసోసియేషన్‌ (ఐ.ఎస్‌.సి.ఎ.) వీటిని నిర్వహించింది. ఐ.ఎస్‌.సి.ఎ. కలకత్తాలోనే 1914లో ప్రారంభం అయింది. ఈ సంస్థ ఏటా జనవరి నెల మొదటి వారంలో సైన్స్‌ కాంగ్రెస్‌ను నిర్వహిస్తుంటుంది. దేశవిదేశాల శాస్త్రవేత్తలు, సైన్స్‌లో నోబెల్‌ గ్రహీతలు హాజరై ప్రసంగిస్తారు.

స్వామీ వివేకానంద 150 వ జయంతి ఉత్సవాలు
ఆధ్యాత్మిక గురువు స్వామీ వివేకానంద అసలు పేరు నరేంద్రనాథ్‌ దత్తా. 
1863 జనవరి 12న కలకత్తాలో జన్మించారు. రామకృష్ణ పరమహంసకు ప్రియ శిష్యులు.

ఇదే ఏడాది మరికొన్ని పరిణామాలు

  • పి.బి.శ్రీనివాస్, శకుంతలాదేవి, శంషాద్‌బేగం, రితుపర్ణోఘోష్, శ్రీహరి, మన్నాడే.. కన్నుమూత.
  • హైదరాబాద్‌ దిల్‌సుఖ్‌ నగర్‌లో ఉగ్రవాదుల బాంబు పేలుళ్లు.
  • లోక్‌సభ, రాజ్యసభల్లో క్రిమినల్‌ లా (అమెండ్‌మెండ్‌) యాక్ట్, 2013 కు ఆమోదం.
  • నేషనల్‌ ఫుడ్‌ సెక్యూరిటీ బిల్, 2013 కు రాజ్యసభ ఆమోదం.
  • ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోదీని ప్రకటించిన బీజేపీ.
  • దేశంలోనే తొలి మహిళా బ్యాంకు (అందరూ మహిళా సిబ్బందే ఉండే బ్యాకు) ముంబైలో 
  • ప్రారంభం. అమల్లోకి హెక్సువల్‌ హెరాస్‌మెంట్‌ ఎట్‌ వర్క్‌ప్లేస్‌ యాక్ట్, 2013.
  • రాజ్యసభలో లోక్‌పాల్, లోకాయుక్త్‌ బిల్లు 2013 ఆమోదం.  
మరిన్ని వార్తలు