తిరువనంతపురంలోని తుంబ ప్రాంతంలో ‘తుంబ ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్’ (టెర్ల్స్) ప్రారంభం అయింది. భూ అయస్కాంత రేఖకు దగ్గరగా ఉండటంతో తుంబాలో ‘టెర్ల్స్’ను ఏర్పాటు చేశారు. ఆ ఏడాది నవంబర్ 21న ఇస్రో ఇక్కడి నుంచి తొలిసారిగా రాకెట్ను ప్రయోగించింది. నాసా తయారీ అయిన నైకీ అపాచే అనే ఆ రాకెట్ను భారత్ తన స్వయం సాంకేతికతతో విజయవంతంగా అంతరిక్షంలోకి పంపింది.