అంతర్జాతీయ సర్వీసులపై నిషేధం పొడిగింపు

28 Jan, 2021 20:28 IST|Sakshi

న్యూదిల్లీ: అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దును పొడిగిస్తున్నట్లు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) అధికారులు తెలిపారు. అయితే, ఎంపిక చేసిన మార్గాల్లో అంతర్జాతీయ సర్వీసుల రాకపోకలను పరిస్థితులను బట్టి సంబంధిత అధికారులు నిర్ణయిస్తారని అధికారులు తెలిపారు. కరోనాతో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ నిషేధాన్ని ఫిబ్రవరి 28 వరకు పొడిగించింది. కార్గో విమానాలను ఎటువంటి షరతులు వర్తించవని స్పష్టంచేసింది. దీనికి సంబందించిన ఒక సర్క్యులర్ ను డీజీసీఏ సంయుక్త డీజీ సునీల్‌ కుమార్‌ జారీ చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మార్చి 23 నుంచి భారత్‌ అంతర్జాతీయ సర్వీసులను రద్దు చేసింది. మే నెల నుంచి ‘వందే భారత్‌’ మిషన్‌లో భాగంగా ఎంపిక చేసిన దేశాలకు, జూలై నుంచి కొన్ని ప్రత్యేక అంతర్జాతీయ విమాన సర్వీస్‌లను నడుపుతున్నారు.(చదవండి: ఫేస్‌‘బుక్‌’ నకిలీ ఖాతాలతో జర జాగ్రత్త!)

మరిన్ని వార్తలు