మందిరం నిర్మించకపోతే నిరాహార దీక్ష 

3 Feb, 2021 11:00 IST|Sakshi
కూల్చివేసిన పురాతన జగన్నాథ మందిరం

పర్లాకిమిడి: రాజవీధిలోని ప్యాలెస్‌కి ఎదురుగా జగన్నాథ మందిరం నిర్మాణం చేపట్టకపోతే నిరాహార దీక్ష చేస్తానని మహేంద్రగిరి భాస్కర తీర్థ లక్ష్మీబాబా హెచ్చరించారు. ఎనిమిదేళ్ల క్రితం అక్కడి అతి పురాతన జగన్నాథుని మందిరాన్ని కూల్చివేశారు. అప్పటి నుంచి ఆ స్థలంలో ఎటువంటి కట్టడాలు జరపకపోగా ఇప్పుడు ఆ స్థలం చెరువుని తలపిస్తోంది. ఆ తర్వాత పాలకులు, అధికారులు పలు సమావేశాల్లో పాత జగన్నాథుని మందిరం స్థానంలో కొత్తగా జగన్నాథుని మందిరం నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు.

భాస్కర తీర్థ లక్ష్మీబాబా    
అయితే ఇంతవరకు ఆ స్థానంలో మందిర నిర్మాణం జరగలేదు. దీనిపై స్థానికులు, జగన్నాథుని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా, వీరికి మద్దతుగా నిలిచిన భాస్కర తీర్థ లక్ష్మీబాబా ఈ నెల 20వ తేదీలోగా మందిరం నిర్మాణ పనులు ప్రారంభించాలని లేకపోతే 21వ తేదీ నుంచి గజపతి ప్యాలెస్‌ ఎదురుగా నిరాహార దీక్ష చేస్తానని తెలిపారు.

మరిన్ని వార్తలు