రేపు ప్రమాణస్వీకారం చేయనున్న భూపేంద్ర
హాజరుకానున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా
గాంధీనగర్: గుజరాత్ కొత్త ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ఎన్నికయ్యారు. ఈ మేరకు బీజేపీ శాసనసభాపక్షం ఏకగ్రీవంగా పటేల్ను ఎన్నుకుంది. భూపేంద్ర పటేల్ ఘట్లోడియా నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కేంద్ర పరిశీలకులుగా విచ్చేసిన నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ జోషి నేతృత్వంలో ఆదివారం సమావేశమైన శాసనసభాపక్షం ఈ మేరకు భూపేంద్ర పటేల్ను ఎన్నుకుంది. సోమవారం భూపేంద్ర పటేల్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.
చదవండి: కాంగ్రెస్కు ఊహించని షాక్: హాట్హాట్గా ఉత్తరాఖండ్ రాజకీయం
పటేల్ సామాజికవర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలనే నిర్ణయంతో ముఖ్యమంత్రిగా భూపేంద్ర పేరును ఖరారు చేశారు. విజయ్ రూపానీ శనివారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈ మేరకు బీజేపీ వ్యూహం రచిస్తోంది. అందులో భాగంగా ఆ రాష్ట్రంలో పరిణామాలు అనూహ్యంగా మారుతున్నాయి. పాటిదార్ సామాజిక వర్గానికే సీఎం, డిప్యూటీ సీఎం పదవులు దక్కాయి. ఉప ముఖ్యమంత్రిగా నితిన్ పటేల్ కొనసాగనున్నారు. సోమవారం మధ్యాహ్నం 2.20 గంటలకు జరిగే భూపేంద్ర పటేల్ ప్రమాణ స్వీకారానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరుకానున్నారు.
భూపేంద్ర చరిత్ర
చదవండి: ‘ఆ కుండ తయారు చేసిందెవరో.. వారికి రోడ్లు, బ్రిడ్జిల కాంట్రాక్ట్ ఇద్దాం