Uma Bharti: అధికారులున్నది చెప్పులు మోయడానికే!

21 Sep, 2021 10:23 IST|Sakshi

భోపాల్‌: ప్రభుత్వాధికారులున్నది నాయకుల చెప్పులు మోయడానికేనంటూ కేంద్ర మాజీ మంత్రి ఉమా భారతి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.‘అధికారుల గురించి మీకేమీ తెలియదు. వారున్నది మా స్లిప్పర్లు మోయడానికే’ అని ఉమ వ్యాఖ్యానించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. తన వ్యాఖ్యలపై ఆ తర్వాత ఉమా స్పందించారు. ఓబీసీ నేతలతో పిచ్చాపాటీ మాటల్లో ఈ వ్యాఖ్యలు చేశానని , నిజానికి తాను అధికారులను వెనుకేసుకొచ్చానని సమర్ధించుకున్నారు. నిజాయతీ ఉన్న అధికారులు బలమైన నాయకులకు మద్దతుగా ఉంటారన్నారు. అయితే తన భావన మంచిదైనా, వాడిన భాష బాగోనందున విచారిస్తున్నానని వివరించారు. 
 

మరిన్ని వార్తలు