Assam Elections 2022: అస్సాం మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీ జయకేతనం

10 Mar, 2022 09:16 IST|Sakshi

గువాహటి:  అస్సాంలో మున్సిపల్‌ ఎన్నికల్లో అధికార భారతీయ జనతా పార్టీ 80 మున్సిపాల్టీలకు గాను ఏకంగా 72 మున్సిపాల్టీలను గెలుచుకుంది. ఎన్నికల ఫలితాలు బుధవారం వెలువడ్డాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ కనీసం ఒక్క మున్సిపాల్టీని సైతం దక్కించుకోలేకపోయింది. మరియానీ, హైలాకండీ పురపాలక సంఘాలను స్వతంత్రులు గెలుచుకున్నారు. మరో ఆరు మున్సిపాల్టీల్లో హంగ్‌ ఏర్పడినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. అస్సాం మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. 

(చదవండి: ఈసీ ఎవరి తొత్తు కాదు.. అన్ని పార్టీలు సమానమే: సీఈసీ సుశీల్‌ చంద్ర.. నేర చరితులు ఎందరంటే..)

మరిన్ని వార్తలు